కరోనా వ్యాక్సీన్ రెండో డోస్ వేసుకున్న ప్రధాని
రెండో డోసు టీకా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ డిల్లీలోని ఎయిమ్స్లో కరోనా రెండో డోసు టీకా తీసుకున్నారు. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ రెండో డోసు టీకా వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ మార్చి 1న కొవాగ్జిన్ తొలిడోసు టీకా తీసుకున్న విషయం తెలిసిందే.