ముగిసిన ఏబి వేంకటేశ్వర రావుపై విచారణ
ఏబివి కేసులో కృత్రిమ డాక్యుమెంట్లు: నిలదీసిన ఏబివి
అమరావతి
కమిషనరాఫ్ ఎంక్వైరీస్ వద్ద ముగిసిన ఏబీ వెంకటేశ్వరరావు విచారణ.
సంచలన కామెంట్లు చేసిన సీనియర్ ఐపీఎస్ ఏబీవీ.
తన కేసు విషయంలో కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారన్న ఏబీవీ.
*ఏబీ వెంకటేశ్వరరావు, సీనియర్ ఐపీఎస్.*
*వైఎస్ వివేకా మరణం ప్రమాదశావత్తూ జరిగిందనడం ఎంత నిజమో.. నాపై ఆరోపణలు కూడా అంతే నిజం. కుట్ర పన్ని నన్ను ఇరికించేందుకు కృత్రిమ డాక్యుమెంట్లు కూడా సిద్దం చేశారు.
కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారనే దానికి సాక్ష్యాలున్నాయి. కృత్రిమ డాక్యుమెంట్ల సృష్టించారని విచారణాధికారి దృష్టికి తీసుకెళ్లా- ఏబివి.
కృత్రిమ డాక్యుమెంట్ల వ్యవహరంపై ప్రభుత్వం విచారణ చేయాలి. నేనే స్వయంగా 21 మంది సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను. కొందరు సంతృప్తికరంగా చెప్పారు. కొందరు వాళ్లకు నచ్చినట్టు చెప్పారు. అల్పులు, అధములు, కుక్కమూతి పిందెలు, చట్టాలు తెలియని వాళ్లు నాపై ఆరోపణలు చేశారు.
14 రోజుల నుంచి విచారణ కొనసాగుతోంది.
నేటితో ఇరుపక్షాల విచారణ ముగిసింది.
నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపిన ఏబివి.
విచారణాధికారి నివేదిక కోసం ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు.
దేశంలో ఓ అధికారి మీద 14 రోజుల్లో విచారణ పూర్తి చేసిన కేసు నాదే అయ్యింటుంది. నేను నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను.