ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను రూ. 2,26,177.53 కోట్ల మేర అంచనా వేశారు. గతేడాది కంటే ఈ ఏడాది బడ్జెట్ 18.38 శాతం పెరిగింది. మొత్తం బడ్జెట్ రూ. 2.26 లక్షల కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ. 1,80,369.33 కోట్లు(20.03 శాతం పెంపు), మూలధన వ్యయం రూ. 29,596.33 కోట్లు(20.03 శాతం పెంపు), రెవెన్యూ మిగులు రూ. 2099.47 కోట్లు(అంచనా), ఆర్థిక లోటు రూ. 32,390.68 కోట్లు(అంచనా)గా పేర్కొన్నారు. ఇక ఈ బడ్జెట్లో సాగునీటి, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు మరింత పెంచారు. రైతులు, మహిళలు, పేదలు, యువత నిరుద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
-వ్యవసాయ రంగానికి రూ. 12,732.97 కోట్లు.
-బీసీ సంక్షేమానికి రూ. 8,242.64 కోట్లు.
-ఉన్నత విద్యకు 3,171. 42 కోట్లు.
-రైతులకు వినూత్న పథకం.. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఆర్థిక సాయం.
-అన్నదాత సుఖీభవ పథకానికి రూ.5 వేల కోట్లు.
-నీటి పారుదల, జలవనరుల శాఖకు రూ.16,852 కోట్లు.
-కాపు కార్పొరేషన్కు రూ.1000 కోట్లు.
-ఉన్నత విద్యకు రూ. 3,171.63 కోట్లు.
-ప్రాథమిక విద్యకు రూ. 22,783.37 కోట్లు.
-పౌర సరఫరాల శాఖకు రూ. 3,763.42 కోట్లు.
-వైద్య శాఖకు రూ. 10,032.15 కోట్లు.
-హోమ్ శాఖకు రూ. 6,397.94 కోట్లు.
-గృహ నిర్మాణ శాఖకు రూ. 4,079.10 కోట్లు.
జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు
పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు
ఐటీకి 1006 కోట్లు
కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు
న్యాయశాఖకు 918 కోట్లు
అసెంబ్లీకి 149 కోట్లు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 7979 కోట్లు
మైనార్టీ వెల్ఫేర్కు రూ. 1308 కోట్లు
ప్లానింగ్కు 1403 కోట్లు
పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రూ. 35,182 కోట్లు
రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు
రియల్ టైమ్ గవర్నెన్స్ 172 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్ 458 కోట్లు
సోషల్ వెల్ఫేర్కు రూ. 6861 కోట్లు
రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు
మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు
యువజన క్రీడలు రూ. 1982 కోట్లు
పలు కొత్త పథకాలకు నిధులు మంజూరు
రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ప్రకటించిన యనమల
అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయింపు
చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు
డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు
క్షత్రియ కార్పొరేషన్కు రూ. 50 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు
యాంత్రీకరణకు రూ. 300 కోట్లు
మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు
రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాలకు 65,486 కోట్లను ఖర్చు చేయనున్న ప్రభుత్వం
ఎస్సీ సబ్ప్లాన్ కింద రూ. 14,367 కోట్లు
ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ. 5,385 కోట్లు
బీసీ సబ్ప్లాన్ కింద రూ. 16,226 కోట్లు
మైనార్టీ సబ్ప్లాన్ కింద రూ. 1,304 కోట్లు
పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు
బీసీల కార్పొరేషన్కు రూ. 3 వేల కోట్లు
ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు
చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు
అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు
చేనేతలకు రూ. 225 కోట్లు
9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు
మైనార్టీలకు దుల్హన్ పథకం కింద రూ. 100 కోట్లు
ఎన్టీఆర్ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు
పెన్షన్ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు
పెన్షన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రూ. 2,133 కోట్లు
ఎన్ఆర్ఈజీఎస్కు రూ. 1000 కోట్లు
రాజధానిలో ల్యాండ్ పూలింగ్కు రూ. 226 కోట్లు
రాష్ట్రంలో రైల్వేలైన్కు రూ. 180 కోట్లు